ఈ ఏడాది విశ్వవేదికపై తెలంగాణ ప్రస్థానం ఉండాలి

2025-01-01 06:55:48.0

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం

సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. ‘నవ వసంతంలో విశ్వవేదికపై విజయ గీతికగా తెలంగాణ స్థానం, ప్రస్థానం ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నూతన సంవత్సరం శుభ సంతోషాలను నింపాలని మనసారా కోరుకుంటున్నా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని రేవంత్‌రెడ్డి తెలిపారు. 

Happy New Year 2025,CM Revanth Reddy,Wishes,State People,Happiness