ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో గందరగోళం

2024-11-20 05:46:55.0

అధికారుల నిర్లక్ష్యంపై స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం

https://www.teluguglobal.com/h-upload/2024/11/20/1379316-ayyannapatrudu-chintakayala.webp

ఏపీ అసెంబ్లీలో నిర్వహిస్తున్న ప్రశ్నోత్తరాల్లో గందరగోళం నెలకొన్నది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక శాఖకు వచ్చిన ప్రశ్నలను వేరే శాఖలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పంపిణీకి సంబంధించిన ప్రశ్న రెవెన్యూకు ఎలా వేస్తారన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గోదావరి పుష్కరాల పనులపై జల వనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడుకు శాసనసభలో ప్రశ్న ఎదురైంది. ఇదే సమయంలో మండలిలో గాలేరు, నగరి, హంద్రీనీవా అనుసంధానం ప్రాజెక్టుపై ప్రశ్న వచ్చింది. ఒకే మంత్రికి ఉభయ సభల్లో ప్రశ్న ఎలా వేస్తారని అధికారులను స్పీకర్‌ ప్రశ్నించారు. దీనిపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.