2024-12-29 22:26:58.0
ఈ నెలాఖరుతో ముగియనున్న ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం
https://www.teluguglobal.com/h-upload/2024/12/29/1390141-vijayanand.webp
ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్నది. నూతన సీఎస్ విజయానంద్ వచ్చే ఏడాది నవంబర్ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు.