కాంగోలో ఘోర ప్రమాదం..38 మంది మృతి

2024-12-22 06:08:16.0

పడవ బోల్తా పడిన ఘటనలో 100 మందికిపైగా గల్లంతయినట్లు అధికారుల వెల్లడి

కాంగోలోని బుసిరా నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. పడవ బోల్తా పడి 38 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 100 మందికిపైగా గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలిస్తుండటంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఫెర్రీలో 400 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నాఉ. వారంతా క్రిస్మస్‌ వేడుకల కోసం సొంతూళ్లకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. గల్లంతైన వారిలో ఇప్పటివరకు 20 మందిని రక్షించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫెర్రీ సిబ్బంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. నాలుగురోజుల కిందట కూడా ఓ నదిలో పడవ బోల్తా పడి 25 మంది మృతి చెందారు. ఈ క్రమంలోనే మరో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించవద్దని అక్కడి అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కొందరు వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో ప్రయాణికులను తరలించే పడవలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. 

Tragic ferry accident,In Congo,Leaves 38 dead and over 100 missing,Busira river,Overloaded vessel capsizes