2024-11-21 05:57:21.0
ఆయన చేత ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
https://www.teluguglobal.com/h-upload/2024/11/21/1379611-sanjay-murthi.webp
కొండ్రు సంజయ్మూర్తి ప్రతిష్టాత్మక భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బాధ్యతలు చేపట్టారు. కాగ్ అధిపతిగా ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. ఈ పదవి చేపట్టిన మొదటి తెలుగు వ్యక్తిగా సంజయ్మూర్తి అరుదైన ఘనత సాధించారు.
అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు సంజయ్మూర్తి. 1964 డిసెంబర్ 24న జన్మించారు. మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ చదివారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ కేడర్కు ఎంపికయ్యారు. ఆ తర్వాత కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. 2021 నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ.. కేంద్రం ప్రవేశపెట్టిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలులో కీ రోల్ ఆయనదే. ఐఏఎస్ అధికారిగా వచ్చే నెలలో రిటైర్మెంట్ కానున్న ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు కాగ్ అధిపతిగా ఉన్న గిరీష్ చంద్ర ముర్ము పదవీ కాలం నిన్నటితో ముగిసింది.
K. Sanjay Murthy,Sworn,New CAG Of India,IAS officer Himachal Pradesh cadre,President Droupadi Murmu