కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం రేవంత్ భేటీ

https://www.teluguglobal.com/h-upload/2025/03/03/500x300_1408236-.webp
2025-03-03 11:18:14.0

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు.

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ చర్చించారు. ముఖ్యమంత్రి వెంట తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం, భీమా ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ స్టేజి -2కు సంబంధించి భూసేకరణ, వివాదాలు 18,189 కోట్ల రూపాయల పెండింగ్ పనులు గురించి రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది.

ప్రధానంగా కృష్ణా జలాల అంశంపై కేంద్ర జలశక్తి మంత్రికి వివరించారు. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా జలాలను ఏపీ అన్యాయంగా తరలించుకుపోతోందని, ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం అనంతరం పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర వాటా, ప్రాజెక్టులపై ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది

Jalashakti Minister CR Patil,CM Revanth Reddy,Delhi tour,Minister Uttam Kumar Reddy,Minister CR Patil,Manohar Lal Khattar,Telangana goverment,Congress party,KCR,KTR,BRS Party
https://www.teluguglobal.com//telangana/cm-revanth-met-with-union-hydropower-minister-1117652