https://www.teluguglobal.com/h-upload/2025/01/12/1393858-encounter-chathisgarh.webp
2025-01-12 11:30:29.0
నలుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. భూపాలపట్నం, మద్దేడు ప్రాంతాల్లో భద్రత దళాలు గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో మావోయిస్టులు, భద్రద దళాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారని పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టులతో పాటు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Encounter,Chhattisgarh,Four Maoists Killed,Beejapur Dist