జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి

2025-01-13 14:47:17.0

సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్రం

నిజామాబాద్ వాసుల కల ఫలించింది. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రేపు జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం జరగనున్నది. 

Palle Ganga Reddy,Appointed,National turmeric board,In Nizamabad district,Notification Released by Central Govt