2023-05-21 05:05:34.0
https://www.teluguglobal.com/h-upload/2023/05/21/767632-kavitha.webp
జూన్ 6వ తేదీన హైదరాబాద్లోని చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగే సభలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలయిన సందర్భంగా అమృతోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశభక్తి – పురోగతి – జాతీయత ప్రధానాంశాలుగా పాలపిట్ట` వాసా ఫౌండేషన్ సంయుక్తంగా కవితల పోటీ నిర్వహించాయి. డా. వాసా ప్రభావతిగారిని స్మరించుకుంటూ జరిపిన ఈ పోటీకి తమ కవితలు పంపించిన కవులకు ధన్యవాదాలు. ఈ కవితల పోటీకి న్యాయనిర్ణేతగా ప్రముఖ విమర్శకులు ఎం. నారాయణశర్మ వ్యవహరించారు. పోటీకి వచ్చిన కవితలని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కవితల పోటీ ఫలితాల వివరాలు ఇక్కడ ఇస్తున్నాము. జూన్ 6వ తేదీన హైదరాబాద్లోని చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగే సభలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది.
మొదటి బహుమతి: శోకం లేని లోకం – నెల్లుట్ల రమాదేవి
రెండో బహుమతి: రేపటి సూర్యోదయం కోసం – పల్లా రోహిణీకుమార్
మూడో బహుమతి: అమృతోత్సవాల ప్రగతి స్ఫూర్తి – రాజా మానాపురం చంద్రశేఖర్
ఎనిమిది కవితలకు ప్రత్యేక బహుమతులు
1. అభినవ భారతి – కరిపె రాజ్కుమార్
2. సత్యమేవ జయతే – స్వప్న మేకల
3. వెలుగులు నింపుదాం- అల్లాడి శ్రీనివాస్
4. వజ్రోత్సవ కానుక – దాసరి మోహన్
5. నా గుండె కాల్చుకుతినే గుడ్డె – వేల్పుల రాజు
6. పొడిచే పొద్దు – బొప్పెన వెంకటేష్
7. స్వేచ్ఛ లేని ప్రాణం మట్టిపటం – శ్రీకాంత్ బింగి
8. మట్టి తిలకం – బి. కళాగోపాల్
పోటీలో ఎంపికయిన ఈ కవితలని పాలపిట్ట పత్రికలో ప్రచురిస్తాం.
– గుడిపాటి, ఎడిటర్, పాలపిట్ట
Palapitta,Competition Results,poetry competition,Telugu Kavithalu