తిరుమలకు భారీ ఆభరణాలతో భక్తుడు

2025-01-01 03:33:02.0

5 కిలోల బంగారు ఆభరణాలు ధరించి మంగళవారం తిరుమలకు వచ్చిన తెలంగాణ ఒలింపిక్‌ సంఘం సంయుక్త కార్యదర్శి కొండా విజయ్‌కుమార్‌

https://www.teluguglobal.com/h-upload/2025/01/01/1390623-konda-vijay-kumar.webp

హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ ఒలింపిక్‌ సంఘం సంయుక్త కార్యదర్శి కొండా విజయ్‌కుమార్‌ 5 కిలోల బంగారు ఆభరణాలు ధరించి మంగళవారం తిరుమలకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన ధరించిన భారీ ఆభరణాలను తోటి భక్తులు ఆసక్తిగా గమనించారు. విజయ్‌కుమార్‌ తరుచూ స్వామివారి దర్శనానికి వస్తుంటారు. బంగారంపై ఉన్న ఆసక్తితోనే భారీ ఆభరణాలు చేయించుకొని ధరిస్తున్నట్లు తెలిపారు.