ధరణి పోర్టల్‌కు ఐదు రోజులు బ్రేక్‌

2024-12-12 12:42:43.0

డేటాబేస్‌లో మార్పుల కారణంగా సేవలకు అంతరాయం

ధరణి పోర్టల్‌కు ఐదు రోజులు బ్రేక్‌ పడనుంది. డేటాబేస్‌ వర్షన్‌ అప్‌గ్రేడ్‌ కారణంగా గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 16వ తేదీ ఉదయం వరకు పోర్టల్‌ పని చేయదని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మధ్యలో ధరణి సేవలకు అంతరాయం కలుగుతున్నందుకు చింతిస్తున్నామని వెల్లడించింది. ధరణి పోర్టల్‌లో ప్రభుత్వం పలు మార్పులు చేస్తోంది. వాటిని అప్‌ డేట్‌ చేసేందుకే పోర్టల్‌ సేవలకు ఐదు రోజుల పాటు బ్రేక్‌ ఇచ్చింది.

Dharani Portal,Version Update,Service Interruption,Telangana Govt,Revenue Department