2024-12-28 16:00:03.0
శ్రీవారికి హుండీ ద్వారా రూ.113 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
https://www.teluguglobal.com/h-upload/2024/12/28/1389900-srivari.webp
గత నవంబరు నెలలో తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా రూ.113 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. 7.31 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాల మొక్కు సమర్పించుకున్నారని… 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారని టీటీడీ చైర్మన్ పేర్కోన్నారు. టీటీడీ చైర్మన్ ఆదేశాలతో గరుడాద్రి పర్వత శ్రేణుల వద్ద టీటీడీ విద్యుత్ సిబ్బంది ఆకర్షణీయమైన లైటింగ్ ఏర్పాటు చేశారు.
గరుడాద్రి పర్వతం… తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డు చివరలో ఉంటుంది. గత ఐదేళ్లుగా అక్కడ లైట్లు లేవని తెలుస్తోంది. ఇటీవలే టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బీఆర్ నాయుడు దీనిపై దృష్టి సారించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల నుండి వారానికి రెండు సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని వస్తున్న వార్తలను టీటీడీ ఈఓ శ్యామలరావు ఖండించారు. దీనిపై టీటీడీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఈఓ తెలిపారు.