2025-02-06 13:49:53.0
నైజీరియాలో ఓ స్కూల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 17 మంది చిన్నరులు దుర్మరణం చెందారు
నైజీరియాలో ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. జంఫారా రాష్ట్రంలో కైరాన నమోదాలోని ఓ ఇస్లామిక్ స్కూల్లో అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బడిలో 100 మంది విద్యార్ధులు ఉన్నారు. స్కూల్ ప్రక్కన నిల్వ ఉంచిన కర్రలను మంటలు అంటుకుని ప్రమాదం సంభవించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
17 మంది పిల్లలు మృతి చెందారని కౌరా-నమోడా స్థానిక ప్రభుత్వ ప్రాంత చైర్మన్ మన్నీర్ మువాజు హైదారా మీడియాకు తెలిపారు. పాఠశాల ఆవరణలో నిల్వ ఉంచిన కర్రల కుప్ప వల్ల సంభవించాయని, గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తూ మంటలకు ఆహుతయ్యాడని తెలుస్తోంది. దర్యాప్తు జరుగుతోంది.
Nigeria,Fire accident,Zamfara State,Chairman Mannir Muaju Hydara,Islamic School,Inter national news,Crime news