2024-12-25 13:09:54.0
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి
https://www.teluguglobal.com/h-upload/2024/12/25/1389031-modi-babu.webp
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రధానిని చంద్రబాబు అభ్యర్థించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుతో పాటు ఏపీ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని కోరారు. ఆరు నెలల కూటమి ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టును ప్రధానికి వివరించారు. చంద్రబాబు విజ్ఞప్తులకు ప్రధాని సానుకూలంగా స్పందించారని సమాచారం. చంద్రబాబు ఈ రోజు రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తోనూ భేటీ కానున్నారు.
PM Narendra Modi,AP CM Chandrababu Naidu,Delhi Tour,Met with PM