2024-12-20 08:25:51.0
ఎఫ్ ఐ ఆర్, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఏసీబీకి లేఖ రాసిన ఈడీ
ఫార్ములా ఈ – రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఎఫ్ఐఆర్, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. ఈ మేరకు ఏసీబీకి లేఖ రాశారు. వివరాలు అందగానే ఈడీ మనీలాండరింగ్ కేసును నమోదు చేయనున్నది.
ED,Entry,Formula E Race Case,KTR,ACB Case