బీపీఎల్‌ కుటుంబాలకే ఉచిత ఇంటి స్థలం

2025-01-27 16:13:45.0

ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

https://www.teluguglobal.com/h-upload/2025/01/27/1398116-ap.webp

దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్‌) కుటుంబాలకే ఉచిత ఇంటి స్థలం కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వివిధ అర్హతలు, నిబంధనలు పేర్కొంటూ ఈ మేరకు ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈమేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇళ్ల స్థలాలకు పదేళ్ల కాలపరిమితితో ఫ్రీహోల్డ్‌ కల్పించేలా కన్వేయన్స్‌ డీడ్‌ ఇవ్వనున్నట్లు పేర్కొన్నది. జీవితకాలంలో ఒకసారే ఉచిత ఇంటిపట్టా ఇవ్వనున్నట్లు తెలిపింది. పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా ఇంటి నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేసింది. లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా ఇంటిస్థలం, సొంతిల్లు ఉండకూడదని, కేంద్ర, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల్లో లబ్ధిదారుగా ఉండకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.