ముగ్గురు ఏపీ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారులకు కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు

2025-02-22 03:38:14.0

అంజనీ కుమార్‌,అభిలాష బిస్త్‌, అభిషేక్‌ మహంతిలను 24 గంటల్లోగా ఏపీ క్యాడర్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశం

తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఏపీ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారులకు కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ డీజీపీ అంజనీ కుమార్‌, తెలంగాణ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్త్‌, కరీంనగర్‌ కమిషనర్‌ అభిషేక్‌ మహంతిలను 24 గంటల్లోగా ఏపీ క్యాడర్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. తెలంగాణ క్యాడర్‌ నుంచి వారిని వెంటనే రిలీవ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

Central Home Department,Issued key orders,Three AP cadre IPS officers,Anjani Kumar,Abhilash Bist,Abhishek Mahanty