2025-01-19 12:26:25.0
ఆదిలాబాద్ జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడింది.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాలేపూర్ ఘాట్లో యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 47 మంది యాత్రికులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108, ప్రైవేటు వాహనాల్లో వాహనాల్లో రిమ్స్, నార్నూర్, ఉట్నూర్ ఆసుపత్రులకు తరలించారు. భక్తులు కెరమెరి మండలంలోని జంగుబాయి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 60 మంది భక్తులు ఉన్నారు. వీరిని గుడిహత్నూర్ మండలం సూర్యగూడ గ్రామ ఆదివాసీలుగా గుర్తించారు.
Adilabad District,Malepur Ghat,Rims,Narnoor,Utnoor Hospital,Crime News,Telangana News,Adilabad