https://www.teluguglobal.com/h-upload/2025/01/22/1396562-accident.webp
2025-01-22 04:56:09.0
ఈ ప్రమాదంలో డ్రైవర్ శివ, ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ వాసులు ముగ్గురు మృతి చెందారు. మంగళవారం రాత్రి వేద పాఠశాల విద్యార్థులు మంత్రాలయం నుంచి హంపికి తుఫాన్ వాహనంలో బయలుదేరారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత సింధనూరుకు 5 కిలోమీటర్ల దూరంలో వాహనం టైర్ పంక్చర్ అయి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తుఫాన్ వాహనం నుజ్జునుజ్జయింది. డ్రైవర్ శివ, ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో వాహనంలో 14 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సింధనూరు హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Fatal Road Accident,In Karnataka,Three Mantralayam,Vedic School Students Die