2024-12-16 04:40:41.0
మూసి నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపించాలని సీపీఐ వాయిదా ప్రతిపాదన
సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం లగచర్లలో ఫార్మా విలేజ్ కు భూసేకరణ ను నిరసిస్తూ కలెక్టర్ ను అడ్డుకున్న రైతులను నెల రోజులుగా జైలులో నిర్బందించడం పై బీఆర్ఎస్ అసెంబ్లీ లో వాయిదా తీర్మానం ఇచ్చింది. మాజీ మంత్రి హరీశ్ రావు వాయిదా తీర్మానం ఇచ్చారు. రైతుల నిర్బంధం పై అసెంబ్లీలో చర్చించాలని కోరారు. మూసి బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే బాధితులకు ప్రత్యామ్నాయం చూపించాలని, మెరుగైన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ సీపీఐ శాసనసభ పక్ష నేత కూనంనేని సాంబశివరావు వాయిదా తీర్మానం ఇచ్చారు.
Telangana,,Legislative Assembly,Lagachrla,Farmers Arrest,Revanth Reddy,Kodangal