https://www.teluguglobal.com/h-upload/2024/11/19/1379213-gang-rape.jfif
2024-11-19 13:46:57.0
ఏపీలో న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కలకలం రేపుతుంది. తాజాగా విశాఖపట్నంలోని రెండవటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది
ఆంధ్రప్రదేశ్లో లా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపుతుంది. తాజాగా విశాఖలోని రెండవటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో న్యాయ విద్యార్థిపై రాత్రి నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె న్యూడ్ ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులకు కోసం గాలించి పట్టుకున్నారు. ఘటనపై ఫిర్యాదు అందగానే పోలీసులు గాలించి నలుగురిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశామని విశాఖ సీపీ శంకబ్రత బాగ్చీ వెల్లడించారు. విద్యార్థినితో గత రెండు నెలలుగా ఒక యువకుడితో పరిచయం ఉందని వెల్లడించారు.
అందరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తున్నామని తెలిపారు. యువతి, యువకులు అందరూ కూడా మేజర్ అని తెలిపారు. నేరాలు అదుపు చేయడానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీపీ వివరించారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖ సీపీతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటామని భరోసా కల్పించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైందని వైసీపీ నేతలు అంటున్నారు.
Visakha,Gang rape,law student,Home Minister Vangalapudi Anita,CM Chandrababu,Visakha CP Sankhabrata Bagchi