వైసీపీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు విజయసాయిరెడ్డి రాజీనామా

2025-01-31 14:33:44.0

వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు

https://www.teluguglobal.com/h-upload/2025/01/31/1399268-sai-reddy.webp

ఇటీవల వైసీపీకి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను పార్టీ అధ్యక్షుడు జగన్ గారికి పంపించాను అంటూ ట్వీట్ చేశారు. మాజీ సీఎం జగన్ ఇవాళ లండన్ నుంచి బెంగళూరు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో, విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు. 2029 ఎన్నికల్లో జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని తెలిపారు .నా రాజకీయ ప్రస్థానంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. శత్రుత్వాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో మరో ప్రస్థానాన్ని ప్రారంభించాను” అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.