2024-11-28 16:56:48.0
నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో డిసెంబర్ 12న జరిగే విచారణకు హాజరుకావాలని నాంపల్లి కోర్టు ఆదేశం
నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. నాగార్జున పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది. డిసెంబర్ 12న జరిగే విచారణకు హాజరుకావాలని మంత్రి కొండా సురేఖను న్యాయస్థానం ఆదేశించింది.
నాంపల్లి కోర్టుకు నటుడు నాగార్జున నేడు హాజరుకానున్నారు. మంత్రి కేటీఆర్పై విమర్శలు చేసే క్రమంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ క్రమంలో మంత్రి సురేఖపై నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు.
Nagarjuna,Nampally court,Defamation case,Minister Konda Surekha,Court summons