ఢిల్లీలో కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

2024-12-12 13:18:02.0

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో పాటు ఎంపీలు కిరణ్‌కుమార్, గడ్డం వంశీ, అనికుమార్ యాదవ్, బలరాంనాయక్, రఘురాం రెడ్డిలు కేంద్రమంత్రిని కలిశారు. అనంతరం రాత్రి 7 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశం అవనున్నారు. ఆ తర్వాత 7.30 గంటలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పలు అనుమతులు, నిధుల మంజూరు గురించి వీరితో సీఎం చర్చించనున్నారు. 

CM Revanth Reddy,Union Minister Kishan Reddy,Delhi,MPs Kiran Kumar,Gaddam Vamsi,Anikumar Yadav,Balarannayak Raghuram Reddy,Education Minister Dharmendra Pradhan