సమంత చికిత్సకు రూ.25 లక్షలు ఇచ్చా నిర్మాత షాకింగ్ కామెంట్స్

 

2024-12-05 15:35:29.0

https://www.teluguglobal.com/h-upload/2024/12/05/1383632-samantha.webp

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు 25 లక్షలు ఇచ్చానని నిర్మాత బెల్లంకొండ సురేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు 25 లక్షలు ఇచ్చానని నిర్మాత బెల్లంకొండ సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలి సినిమాలో అల్లుడు శ్రీను సమయంలో హీరోయిన్ సమంత చర్మ సంబంధిత అనారోగ్యంతో బాధపడ్డారని ఈ మూవీ నిర్మాత బెల్లకొండ సురేష్ ఓ ఇంటర్వూలో తెలిపారు. ట్రీట్‌మెంట్‌కు అవసరమైన డబ్బులు నిర్మాతలేవరు ఇవ్వలేదు. నేను రూ.25 లక్షలు ఇచ్చాను. ఆమె ప్రైవసీ కొసం సినిమా అయ్యేదాక పైవ్ స్టార్ హాటల్‌లో ఉంచామని ఆయన తెలిపారు.

నాలుగు నెలలకు కొలుకున్నా ఇప్పటికీ ఆ సాయాన్ని ఆమె మరచిపోలేదని సురేష్ పేర్కొన్నారు. సమంత, నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మయోసైటీస్ వ్యాధి బారిన పడ్డ విషయం తెలిసిందే. ఈ సమస్య ముదిరిన తర్వాత అందరితో చెప్పుకుంది సమంత. తర్వాత విదేశాలకు కూడా వెళ్లి ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేసింది. ఫలితంగా ఏడాది పాటు ఇండస్ట్రీకి కూడా దూరమైంది.ఇక సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో కూడా సమంత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని, ఆ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే. 

 

Heroine Samantha,Producer Bellamkonda Suresh,Alluḍu Srinu,Naga Chaitanya,Myositis,Bellamkonda Sai Srinivas